News February 23, 2025

GWL: మహాశివరాత్రికి స్పేషల్.. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి 357 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు MBNR ఆర్టీసీ RM సంతోష్ కుమార్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 24న 26, 25న 51, 26న 151, 27న 91, 28న 38 బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీశైలం వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని కోరారు. 30 మందికి పైబడి ఉంటే ఆ ప్రదేశానికి బస్సు పంపుతామన్నారు.

Similar News

News February 23, 2025

రాజలింగమూర్తి హత్య ఘటనలో ఏడుగురు అరెస్ట్

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య ఘటనలో 10 మందిపై కేసు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిలో బీఆర్ఎస్ ముఖ్యనేత కొత్త హరిబాబు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

News February 23, 2025

CISFలో 1161 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులకు 945, మహిళలకు 103, ఎక్స్‌సర్వీస్‌మెన్-113 ఖాళీలున్నాయి. టెన్త్/ సంబంధిత ట్రేడ్ ఉన్న 18 నుంచి 23 ఏళ్లలోపు వారు అర్హులు. మార్చి 5 నుంచి APR 3 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <>https://cisfrectt.cisf.gov.in/<<>>ను చూడండి.

News February 23, 2025

పనికి జస్టిఫై చేయాలి.. లేదంటే ఉద్యోగాల కోత: మస్క్

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫెడరల్ సిబ్బంది తమ పనికి జస్టిఫై చేయాలి. లేదంటే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఏం చేశారో ప్రతి సోమవారం రా.11.59లోపు నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ప్రకటనను ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ ఖండించారు. చట్టవిరుద్ధమైన తొలగింపులను కోర్టులో సవాల్ చేస్తాన్నారు.

error: Content is protected !!