News February 28, 2025

GWL: మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం: ఎస్పీ 

image

మహిళల రక్షణ షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్- 2 జిల్లాలలో జనవరి నెలలో గద్వాల షీ టీమ్స్ బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జనవరిలో 14 ఫిర్యాదులు స్వీకరించి, 13 మందిని పట్టుకుని, 1FIR, 13 పెట్టి కేసులు నమోదు చేసిందని ప్రశంసించారు.

Similar News

News November 8, 2025

మహానంది: కోడిపిల్లకు రెండు తలలు

image

ఒక కోడి 10 నుంచి 20 గుడ్లు పెడుతుంది. పొదిగే నుంచి పిల్లలను పెట్టే వరకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుందో అంచనా వేయలేం. కానీ మహానందిలోని అబ్బీపురంలో గురువయ్య ఇంట్లో ఓ కోడి పిల్లకు రెండు తలలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువారం జన్మించగా శుక్రవారం మృతి చెందిందన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.

News November 8, 2025

రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో మరమ్మతులు

image

రామాపురం వద్ద కూలిన చప్టాను రూ.6.5 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించామని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.రెండు కోట్ల అంచనాలతో తయారుచేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. కొత్తపేట గ్రామంలో చప్టాను రూ.12 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతు చేయవచ్చన్నారు. శాశ్వత పరిష్కారానికి రూ.3.50 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు.

News November 8, 2025

యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

image

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.