News February 27, 2026

GWL: రైతులను ముంచిన గుంటూరు కోల్డ్ స్టోరేజ్ యజమాని

image

గుంటూరు‌లోని కోల్డ్ స్టోరేజ్ యజమాని గద్వాల రైతులను నిలువునా ముంచాడు. స్థానిక లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్‌లో రైతులు భద్రపరుచుకున్న సుమారు 1850 బస్తాల మిర్చిని యజమాని అక్రమంగా విక్రయించేశాడు. తమ పంట మాయమవడంతో రైతులు గత నెల రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కష్టార్జితాన్ని ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

Similar News

News February 28, 2026

ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు: JD వాన్స్

image

ఇరాన్‌పై ఒకవేళ సైనిక దాడులు చేసినా అది సుదీర్ఘ యుద్ధానికి దారితీసే అవకాశం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు దేశంగా మారకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం సైనిక, దౌత్యపరమైన వ్యూహాలను పరిశీలిస్తోందని తెలిపారు. గతంలో ఇరాక్ యుద్ధం వంటి తప్పులు మళ్లీ జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చర్చల ద్వారానే పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

News February 28, 2026

పనీర్ vs సోయా చంక్స్: ప్రొటీన్ లెక్కల్లో ట్విస్ట్

image

పనీర్ కంటే సోయా చంక్స్‌లోనే ప్రొటీన్ ఎక్కువ. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రొటీన్ ఉంటే సోయాలో 52 గ్రాములు ఉంటుంది. కానీ, మనం ఒకేసారి 100 గ్రాముల పనీర్ తినగలం. అదే సోయా చంక్స్ ఉడికాక అంత మొత్తంలో తినడం కష్టం. సాధారణంగా మనం తినగలిగే 20 గ్రాముల సోయా ద్వారా 10 గ్రాముల ప్రొటీనే అందుతుంది. కాబట్టి ప్రొటీన్ డెన్సిటీలో సోయా బెటర్ అయినా.. శరీరానికి అందే పోషకాల పరంగా మాత్రం పనీర్ బెస్ట్ ఛాయిస్.

News February 28, 2026

బంగారం ధరల ఎఫెక్ట్.. ₹4 లక్షల కోట్లకు లోన్స్!

image

బ్యాంకుల రిటైల్ రుణాల్లో గోల్డ్ లోన్స్ వాటా గతేడాదితో పోలిస్తే 3% నుంచి 6%కి పెరిగింది. జనవరి నాటికి గోల్డ్ లోన్స్ 128% వృద్ధి చెంది దాదాపు ₹4 లక్షల కోట్లకు చేరాయి. బంగారం ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రిటైల్ విభాగంలో క్రెడిట్ కార్డ్ లోన్స్ తగ్గగా వెహికల్ లోన్స్ 17% వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం డిపాజిట్లు ₹247.7 లక్షల కోట్లుగా ఉండగా లోన్లు ₹204.32 లక్షల కోట్లకు చేరాయి.