News April 5, 2025

GWL: రైలు నుంచి పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఇటిక్యాలలో జరిగింది. స్థానికుల వివరాలు.. పూడురు-ఇటిక్యాల రైల్వేస్టేషన్ మధ్యలో ఓ 45ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి రైలులో నుంచి కిందపడి మృతి చెందారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు మృతదేహాన్ని గద్వాల మార్చురీకి తరలించారు.

Similar News

News January 10, 2026

రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా పెద్దకడబూరు పీఎస్

image

పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.

News January 10, 2026

ఈనెల 13న హనుమకొండలో ఉద్యోగ మేళా

image

ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా శాఖ అధికారి బి.సాత్విక తెలిపారు. సుమారు 75 ప్రైవేట్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 21 నుంచి 45 ఏళ్ల యువత అర్హులని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత ధృవపత్రాలతో ములుగు రోడ్డు వద్ద గల తమ కార్యాలయంలో జరుగే మేళాకు హాజరు కావాలన్నారు.

News January 10, 2026

సూర్యాపేట: రైతు ఇంట్లో ప్రేమ పక్షుల ముచ్చట!

image

మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగవుతున్న తరుణంలో.. పక్షుల మధ్య అపారమైన అనురాగం చూపరులను ఆకట్టుకుంది. సూర్యాపేట జిల్లా ముక్కుడుదేవులపల్లిలో రైతు మల్లేష్ ఇంట్లోని చెట్టుపై శనివారం సాయంత్రం పక్షులు ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న అరుదైన దృశ్యం కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి గ్రామస్థులు మంత్రముగ్ధులయ్యారు. ప్రకృతిలోని ఈ అందమైన అనుబంధాన్ని పలువురు తమ చరవాణిల్లో ఆసక్తిగా చిత్రీకరించారు.