News March 4, 2025
GWL: ‘లింగమ్మ బావి సుందరీకరణ చర్యలు చేపట్టాలి’

గద్వాల పట్టణంలోని లింగమ్మ బావి సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆర్కిటిక్ శ్రీలేఖతో కలిసి లింగమ్మ బావిని పరిశీలించారు. బావిలోకి దిగేందుకు ఉన్న స్టెప్ లెవెల్ను పునరుద్ధరించి, ఎప్పటికీ నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బావి చుట్టూ రైలింగ్ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేయాలని సూచించారు.
Similar News
News March 4, 2025
చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్యంశాలు

☞ తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో చిత్తూరుకు ఐదో స్థానం
☞ చిత్తూరు జిల్లాలోని హోటళ్లలో తనిఖీలు
☞ చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి
☞ పుంగనూరులో 12 మంది బైండోవర్
☞ చిత్తూరు: జైలులో వైసీపీ నాయకులకు రోజా పరామర్శ
☞ మల్లప్ప కొండ వద్ద రేపు మినీ కల్చరల్ ఈవెంట్
☞ పలమనేరు: తల్లిపై క్రికెట్ బ్యాట్తో దాడి చేసిన కుమారుడు
News March 4, 2025
నల్గొండ: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ.

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలలో 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
News March 4, 2025
GEFI & శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్

HYDకు చెందిన జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్, కోయంబత్తూరుకు చెందిన మసాలా బ్రాండ్ శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు మంగళవారం ప్రెస్మీట్లో సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. బ్రాండింగ్& పంపిణీకి రూ.70 కోట్లు, రాబోయే రెండేళ్లలో మరో రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర రెడ్డి, విజయ్ ప్రసాద్, అక్షయ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.