News December 29, 2025
GWL: వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

నూతన సంవత్సర 2026 వేడుకలు శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు నిబంధనలు విధించామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగంగా మద్యం సేవించడం, ర్యాలీ, డీజీలు వినియోగించడం నిషేధించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News December 29, 2025
మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాలిపటాలు ఎగిరేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
News December 29, 2025
మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాలిపటాలు ఎగిరేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
News December 29, 2025
NZB: 21 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 21 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.


