News December 23, 2025
GWL: హక్కులపై అవగాహన ఉండాలి: ప్రిన్సిపల్

వినియోగదారులు తమ హక్కులను ఆయుధంగా మలుచుకున్నప్పుడే మార్కెట్లో మోసాలను అరికట్టవచ్చని ఎంఏఎల్డీ కళాశాల ప్రిన్సిపల్ డా.కలందర్ బాషా అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఆస్రా’ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు వినియోగదారుల చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
Similar News
News December 26, 2025
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి CBN వినతి

AP: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను CM CBN కోరారు. పంచసూత్రాల ప్రణాళిక అమలుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.70% అభివృద్ధి సాధించామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి ఇప్పటికే సమర్పించినట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు.
News December 26, 2025
రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.
News December 26, 2025
GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

*శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్రావు
* కూకట్పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా


