News February 23, 2025

GWL: మహాశివరాత్రికి స్పేషల్.. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి 357 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు MBNR ఆర్టీసీ RM సంతోష్ కుమార్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 24న 26, 25న 51, 26న 151, 27న 91, 28న 38 బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీశైలం వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని కోరారు. 30 మందికి పైబడి ఉంటే ఆ ప్రదేశానికి బస్సు పంపుతామన్నారు.

Similar News

News February 23, 2025

జనగామ: గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా నేడు(ఆదివారం) జరిగిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరయ్యారని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల డీసీవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,851 మంది 1,800 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 5వ తరగతిలో 16 మంది, 6వ తరగతిలో 14 మంది, 7వ తరగతిలో 12 మంది, 8వ తరగతిలో ఐదుగురు, 9వ తరగతిలో నలుగురు గైర్హాజరు అయ్యారని వెల్లడించారు.

News February 23, 2025

అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ

image

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని PM మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్&సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకుకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. క్యాన్సర్‌తో పోరాడేందుకు బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేశామని, మందులు చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

News February 23, 2025

ఖరారైన CM మంచిర్యాల జిల్లా పర్యటన

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లా పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ అధికారి నిర్మల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రేపు మ:2:15 నిమిషాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నట్లు తెలిపారు. మ.2:20కి సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతరం సాయంత్రం సా4:00గంటలకు తిరిగి బయలుదేరుతారు.

error: Content is protected !!