News December 31, 2024
H1B వీసా వివాదం: రంగంలోకి దిగిన కేంద్రం

అమెరికాలో H1B వీసాలు కలిగిన భారతీయులపై వ్యతిరేక పరిస్థితులను కేంద్రం పర్యవేక్షిస్తోంది. చట్టబద్ధంగా పనిచేస్తున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా IT, కామర్స్, విదేశాంగ శాఖలు రంగంలోకి దిగాయి. అక్కడి పరిణామాలను గమనిస్తున్నాయి. H1B వీసాల్లో మన కాంపిటీటివ్ పొజిషన్పై ప్రభావం పడకుండా చూడనున్నాయి. వలస విధానంపై ట్రంప్ అనుచరులు, మస్క్ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.
Similar News
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 6, 2025
భక్తికి ప్రతీక ‘తిరుమలనంబి ఆలయం’

తిరుమలనంబి శ్రీవారికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తిరుమలకు వచ్చిన మొదటి భక్తుడు. ఆయన భగవద్రామానుజులకు అలిపిరిలో రామాయణ రహస్యాలను బోధించారు. అందుకే, శ్రీవారి ఊరేగింపు సమయంలో, దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయం వద్ద స్వామివారు ఆగి, హారతిని స్వీకరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ ఆలయం ఆయన గొప్ప భక్తికి, శ్రీవారిపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


