News September 20, 2025
H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న <<17769573>>నిబంధనను<<>> విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.
Similar News
News September 20, 2025
ఇడ్లీ, దోశపై GST.. ప్రచారాస్త్రం కానుందా..?

కేంద్రం తాజా GST మార్పుల్లో ఇడ్లీ, దోశలను 5% శ్లాబులోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఉత్తరాదిన ఎక్కువ తినే రోటీలను 0% పన్నులోకి తీసుకొచ్చి సౌత్లో పాపులర్ టిఫిన్ల ట్యాక్స్ మార్చలేదు. అసలే ఉత్తరాది, హిందీ ఆధిపత్య అంశాలు తరచూ ప్రస్తావనకు వచ్చే తమిళనాట రానున్న వేసవిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడి పార్టీలకు ఈ పన్ను BJPపై ప్రచారాస్త్రంగా మారవచ్చని విశ్లేషకుల అంచనా. టిఫిన్ ట్యాక్స్పై మీ కామెంట్?
News September 20, 2025
పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.
News September 20, 2025
Dy.CM పవన్కు ధన్యవాదాలు: బోండా ఉమ

AP: అసెంబ్లీలో <<17761609>>ప్రస్తావించిన సమస్య<<>>ను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం పెరుగుతున్నాయి’ అని బోండా ట్వీట్ చేశారు.