News March 30, 2024
ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
Similar News
News February 14, 2026
చేతులు మెరిసేలా..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.
News February 14, 2026
స్కాట్లాండ్పై ఇంగ్లండ్ విజయం

T20WC: కోల్కతా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటిష్ జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 86కే 4 వికెట్లు పడిన సమయంలో స్కాట్లాండ్ పైచేయి సాధించినట్లే కన్పించింది. ఆపై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా బౌండరీలు బాదుతూ విజయం వైపు నడిచారు. 18.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించారు. బ్యాంటన్ 41 బంతుల్లోనే 63 పరుగులతో రాణించారు.
News February 14, 2026
ALERT: ఇలాంటి వారు ఉపవాసం చేయకండి!

మహాశివరాత్రి ఉపవాసం అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడేవారు ఉపవాసం ఉండటం ప్రమాదకరం. వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలు, పండ్లు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శివారాధన చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. share it


