News March 30, 2024

ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

image

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

Similar News

News January 18, 2026

జగన్ ఉన్మాదానికి మరో BC నేత బలి: TDP

image

AP: మరో బీసీ నేతను జగన్ ఉన్మాదం బలి తీసుకుందని TDP మండిపడింది. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన TDP నాయకుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లి వస్తున్న బీసీ నేత లాలం బంగారయ్యను YCP నేతలు హత్య చేశారని ఆరోపించింది. బీసీ నేతలే టార్గెట్‌గా YCP చేస్తున్న దాడులు, హత్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది. అధికారం దక్కలేదనే పగతో ప్రజలను జగన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించింది.

News January 18, 2026

మెస్రం వంశీయుల ఆచారాలు

image

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.

News January 18, 2026

మెస్రం వంశీయుల ఆచారాలు

image

నాగోబా జాతరను మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగోబా స్వామికి పరిచయం చేసే భేటింగ్ ఆచారం ప్రత్యేకమైనది. ఈ పూజ తర్వాతే వారు వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందుతారు. అలాగే, జాతర కోసం గోదావరి నుంచి నీరు తెచ్చేటప్పుడు వీరు చెప్పులు వేసుకోకుండా కాలినడకన ప్రయాణిస్తారు. కులదైవం పట్ల వారికున్న అపారమైన భక్తికి, వంశ గౌరవానికి ఈ ఆచారాలు నిదర్శనం.