News March 30, 2024
ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
Similar News
News February 3, 2026
ఈ నెల 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు FEB 26- MAR 2 వరకు జరగనున్నాయి. FEB 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, FEB 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, మార్చి 1, 2న మలయప్పస్వామి పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. FEB 26, 27న సహస్రదీపాలంకార సేవ, FEB 28, MAR 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.
News February 3, 2026
పూజ గదిలో ఉండకూడని విగ్రహాలు

పూజ గదిలో నిలబడి ఉన్న లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడి విగ్రహాలు, ఉగ్ర రూప మూర్తులు ఉంచకూడదు. అలా ఉంటే సంపద నిలవదని అంటారు. ఎత్తుగా ఉండే విగ్రహాలు కూడా అరిష్టమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పెద్ద విగ్రహాల ఆకర్షణ శక్తిని ఇల్లు భరించలేదు కాబట్టి వాటిని గుడికే పరిమితం చేయాలంటున్నారు. మరణించిన వారి ఫొటోలు సైతం పూజా మందిరంలో పెట్టకూడదట. తద్వారా దైవాగ్రహానికి గురై శాంతి, ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
News February 3, 2026
ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.


