News March 30, 2024
ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
Similar News
News February 19, 2026
పాక్లో పేలుడు.. 16 మంది మృతి

పాకిస్థాన్ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.
News February 19, 2026
తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.
News February 19, 2026
పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు ఉంటే?

ఇంటికి పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు, లోయలు, గుంతలు, చెరువులు ఉండటం మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. దీనివల్ల ఇంటికి, ఇంట్లోవారికి భవిష్యత్తులో భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ‘మురికి కాలువలు ఇళ్లకు ఏదిక్కున ఉన్నా ఆరోగ్య సమస్యలుంటాయి. నీటి ప్రవాహాలు ఇళ్లకు తూర్పు, ఉత్తర దిశల్లో ఉండాలి’ అంటున్నారు. అన్ని వాస్తు నియమాలకు శాస్త్రీయ జవాబులుండవని స్పష్టం చేస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


