News March 28, 2024
హెయిర్ స్ట్రయిటెనింగ్.. కిడ్నీలను దెబ్బ తీసింది

హెయిర్ స్ట్రయిటెనింగ్ కోసం రెగ్యులర్గా సెలూన్కి వెళుతున్న ఓ మహిళ(26) శరీరంలో కిడ్నీలు దెబ్బతిన్నాయి. అది కూడా రెండేళ్లలోనే మూడుసార్లు జరగడం గమనార్హం. హెయిర్కి వాడిన యాసిడ్స్ శరీరంలోకి ప్రవేశించి కిడ్నీలను దెబ్బతీసినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు గతంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. అయితే ఒకరోజు వాంతులు, విరోచనాలు, వెన్ను నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా ఈ సమస్య వెలుగు చూసింది.
Similar News
News December 1, 2025
MHBD: నేటి నుంచి కొత్త వైన్ షాపుల ప్రారంభం

జిల్లాలో 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం మొత్తం 61 వైన్ షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సులు కేటాయించారు. ఇందులో మహబూబాబాద్-27, తొర్రూర్-22, గూడూరు-12 ఎక్సైజ్ శాఖ పరిధిలో 61 షాపులు నిర్వహిస్తున్నారు. డ్రాలో ఎంపికైన నూతన నిర్వాహకులకు అధికారులు లైసెన్సులు అందజేయడంతో వారు సోమవారం నుండి కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.
News December 1, 2025
ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.
News December 1, 2025
ఐటీ జాబ్ వదిలి.. ఆవులతో రూ.2 కోట్ల టర్నోవర్!

పని ఒత్తిడితో రూ.లక్షల జీతం వచ్చే IT కొలువు కన్నా, గోవుల పెంపకమే మేలనుకున్నారు అహ్మదాబాద్కు చెందిన శ్రీకాంత్ మాల్డే, చార్మి దంపతులు. జాబ్ వదిలి, 2014లో 4 ఆవులను కొని వాటి పాలు, పేడతో ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మారు. కల్తీలేని గోఉత్పత్తులకు డిమాండ్ పెరగ్గా మరిన్ని ఆవులను కొన్నారు. కట్ చేస్తే 2024 నాటికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సక్సెస్కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


