News November 20, 2024

అమెరికాలోని సగం విద్యార్థులు తెలుగోళ్లే..!

image

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 56 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని హైదరాబాద్‌లోని US కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. వీరిలో AP నుంచి 22 శాతం, TG నుంచి 34 శాతం మంది ఉన్నారు. USలో మొత్తం 3.3 లక్షల మంది భారత విద్యార్థులు ఉండగా లక్షన్నరకుపైగా మనవాళ్లే. ప్రస్తుతం రోజుకూ 1,600 వీసాలు జారీ చేస్తున్నారు. అలాగే 8 వేల మంది అమెరికన్లు భారత్‌లో చదువుతున్నారు.

Similar News

News November 18, 2025

MBNR: నవోదయ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

image

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News November 18, 2025

జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అవసరమయ్యే ఎరువులు

image

జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో మంచి దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన ఎరువులను వివిధ దశల్లో అందించాలి.
☛ పంట విత్తేటప్పుడు 50kg DAP+20kg MOP వేయాలి.
☛ పంట 20 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 40 రోజుల వయసులో 50kg యూరియా
☛ పంట 60 రోజుల వయసులో 25kg యూరియా+15kg MOP ☛ ప్రతి మూడు సీజన్లకు ఒకసారి జింక్ సల్ఫేట్ 20kgలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 18, 2025

జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో కలుపు నివారణ

image

పంట విత్తిన 48గంటల్లో 200L నీటిలో అట్రాజిన్ 1kg పొడి మందు కలిపి పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఎకరాకు 200L నీటిలో పారాక్వాట్ 1L కలిపి విత్తే ముందు లేదా విత్తాక పిచికారీ చేయాలి. 20-25 రోజులకు వెడల్పాటి కలుపు మాత్రమే ఉంటే 200L నీటిలో 400 గ్రా. 2,4-D సోడియంసాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, ఆకుజాతి కలుపు ఉంటే ఎకరానికి 200L నీటిలో టెంబోట్రాయాన్ 34.4% 115ml కలిపి పిచికారీ చేయాలి.