News August 22, 2024
ఏలూరులో వందేభారత్ రైలుకు హాల్టింగ్

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలు(20707/20708)కు ఆగస్టు 25 నుంచి ఏలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు విజయవాడ-రాజమండ్రి మధ్య ఈ రైలుకు ఒక్క స్టాప్ కూడా లేదు. ఇకపై ఉదయం 9.49కి విశాఖ వెళ్లే రైలు.. సాయంత్రం 5.54కు విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఏలూరులో ఆగుతాయి. తమ విజ్ఞప్తితో ఏలూరులో ఈ రైలుకు హాల్టింగ్ ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.