News August 22, 2024
ఏలూరులో వందేభారత్ రైలుకు హాల్టింగ్

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలు(20707/20708)కు ఆగస్టు 25 నుంచి ఏలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు విజయవాడ-రాజమండ్రి మధ్య ఈ రైలుకు ఒక్క స్టాప్ కూడా లేదు. ఇకపై ఉదయం 9.49కి విశాఖ వెళ్లే రైలు.. సాయంత్రం 5.54కు విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఏలూరులో ఆగుతాయి. తమ విజ్ఞప్తితో ఏలూరులో ఈ రైలుకు హాల్టింగ్ ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 6, 2026
అమెరికా పిచ్చి పనులు చేస్తే.. ఇరాన్ వార్నింగ్

మంగళవారం రాత్రి లోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై సుప్రీం లీడర్ మొజ్తబా అడ్వైజర్ అలీ అక్బర్ దీటుగా స్పందించారు. ‘అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్-అల్-మండెబ్ మూతపడుతుంది’ అని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలోని బాబ్-అల్-మండెబ్ ఆయిల్, ఇతర వస్తువుల రవాణాకు ఎంతో కీలకం. హార్ముజ్ మూసివేతతో సౌదీ ఇక్కడి నుంచే ఆయిల్ ఎగుమతి చేస్తోంది.
News April 6, 2026
బాసర ఆలయానికి మహర్దశ.. నేడు సీఎం భూమిపూజ

TG: బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం పున:నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మ.12 గం.కు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లోని ఒక భాగాన్ని విడుదల చేసింది. 2 వేల చదరపు అడుగుల్లో గర్భాలయం, ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు నిర్మించనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల sft నుంచి 62 వేల sftకి పెంచనున్నారు.
News April 6, 2026
ALERT: వాషింగ్ మెషీన్ ఆన్ చేసి స్నానం చేస్తున్నారా?

వాషింగ్ మెషీన్ ఆన్లో ఉన్నప్పుడు స్నానం చేయొద్దని ఎలక్ట్రీషియన్లు సూచిస్తున్నారు. ‘మెషీన్ నడుస్తున్నప్పుడు విద్యుత్ లీకేజీ వల్ల షాక్ తగిలే అవకాశం ఉంది. వైబ్రేషన్, ప్రెజర్ వల్ల వైరింగ్ దెబ్బతిని తడి ప్రాంతానికి తగలొచ్చు. పైగా మెషీన్, షవర్కు ఒకే వేస్టేజ్ పైప్ ఉంటుంది. దీనివల్ల ప్రమాదం మరింత ఎక్కువ. అందుకే దాన్ని ఆఫ్ చేశాక 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది’ అని చెబుతున్నారు. #SHARE IT


