News October 17, 2024
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ హతం!
హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ చీఫ్ యాహ్య సిన్వర్ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. గాజాలో ఆ దేశ మిలిటరీ ముగ్గురిని హతమార్చింది. ఇందులో సిన్వర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తోంది. అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉందని IDF తెలిపింది. గతేడాది OCT 7న ఇజ్రాయెల్పై తొలిసారి దాడిలో మాస్టర్ మైండ్ సిన్వర్దే. సిన్వర్ కంటే ముందు హమాస్ చీఫ్ హనియాను కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది.
Similar News
News October 18, 2024
ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతలో ట్విస్ట్
AP: చిత్తూరు(D) మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం <<14370148>>కూల్చివేత ఘటనలో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య పోరు తలెత్తింది. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
News October 17, 2024
ఆసీస్కు షాక్.. ఫైనల్కు సౌతాఫ్రికా
మహిళల T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు షాకిచ్చింది. 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఓడిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 134/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. చివరి మూడు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
News October 17, 2024
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా లేనట్లేనా?
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ప్రెస్ మీట్లో వాయిదా విషయమై అడిగిన ప్రశ్నకు ఇది సందర్భం కాదని సీఎం దాటవేశారు. మరోవైపు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో వాయిదా పడే అవకాశం లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.