News April 17, 2024
రాళ్లు పట్టుకున్న చేతుల్లో ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చాయి: షా

జమ్మూకశ్మీర్లో బీజేపీ విజయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల నమ్మకాన్ని, ప్రేమను పొందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కమలం దానంతట అదే వికసిస్తుందన్నారు. ‘ప్రధాని మోదీ హయాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించింది, రాళ్లు దాడులు ఆగాయి, ఆర్టికల్ 370 రద్దైంది. ఒకప్పుడు రాళ్లు పట్టుకున్న జమ్మూకశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News January 28, 2026
‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈనెల 31న కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీమంతం సమయంలో ఇన్స్టా పోస్ట్తో తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఉపాసన <<18084618>>హింట్<<>> ఇచ్చారు. కాగా 2023 జూన్లో వీరికి క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. వారసుడొస్తున్నాడంటూ ఫ్యాన్స్ Xలో సందడి చేస్తున్నారు.
News January 28, 2026
వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య: రామ్మోహన్

మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేదని ఆయన వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. మరోవైపు కాసేపట్లో రామ్మోహన్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. MHలోని బారామతిలో ఈ ఉదయం ఫ్లైట్ క్రాషై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే.
News January 28, 2026
మహిళా పైలట్పై అజిత్ పవార్ ట్వీట్.. వైరల్

మహారాష్ట్రలో జరిగిన <<18980548>>ప్రమాదంలో<<>> అజిత్ పవార్తోపాటు మహిళా పైలట్ శాంభవీ పాఠక్ మరణించడం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే.. పైలట్గా ఉన్నది ఓ మహిళ అని అర్థం చేసుకోవాలి’ అని 2024 జనవరి 18న ఆయన ట్వీట్ చేశారు. #NCPWomenPower అని హాష్ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


