News April 12, 2025
ఏడాదికి రెండు సార్లు హనుమజ్జయంతి.. ఎందుకంటే..

నేడు చైత్ర శుద్ధ పౌర్ణమి. హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు. ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవం లేదా జయంతిగా జరుపుకొంటారు. ఇక పరాశర సంహిత ప్రకారం.. వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున స్వామివారు జన్మించారు. ఆ తిథిని జన్మోత్సవం/జయంతిగా జరుపుతారు. రెండు సందర్భాల్నీ చాలామంది జయంతిగానే జరపడం వల్ల ఏటా 2సార్లు హనుమజ్జయంతి వస్తుంటుంది.
Similar News
News March 30, 2026
ఢిల్లీకి రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి

సరకులు, ఔషధాలు తదితర మానవతా సాయాన్ని పొందేందుకు ఢిల్లీకి రావాల్సిన మహాన్ ఎయిర్ జెట్ విమానం అమెరికా దాడిలో ధ్వంసమైంది. ఇరాన్లోని మషద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఫ్లైట్ ఉండగా దాడి జరిగింది. భారత్ ఇప్పటికే మార్చి 18న నిత్యావసరాలను టెహ్రాన్కు పంపిన విషయం తెలిసిందే. రెండో దఫా 11 టన్నుల సరకులను సిద్ధంగా ఉంచింది. వీటి కోసం మహాన్ విమానం ఎల్లుండి ఢిల్లీకి రావాల్సి ఉంది.
News March 30, 2026
ఢిల్లీకి రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి

సరకులు, ఔషధాలు తదితర మానవతా సాయాన్ని పొందేందుకు ఢిల్లీకి రావాల్సిన మహాన్ ఎయిర్ జెట్ విమానం అమెరికా దాడిలో ధ్వంసమైంది. ఇరాన్లోని మషద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఫ్లైట్ ఉండగా దాడి జరిగింది. భారత్ ఇప్పటికే మార్చి 18న నిత్యావసరాలను టెహ్రాన్కు పంపిన విషయం తెలిసిందే. రెండో దఫా 11 టన్నుల సరకులను సిద్ధంగా ఉంచింది. వీటి కోసం మహాన్ విమానం ఎల్లుండి ఢిల్లీకి రావాల్సి ఉంది.
News March 30, 2026
గడ్డి మందును నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం

TG: రాష్ట్రంలో <<19342806>>పారాక్వాట్ డైక్లోరైడ్<<>>(గడ్డి మందు)ను నిషేధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులు వ్యవసాయం కోసం వాడుతున్న ఈ ప్రాణాంతక రసాయనాన్ని ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధించారని తెలిపారు. ఈ మందు వల్ల చాలా మంది రైతులు చనిపోయారన్నారు. ఈ మందు తయారీ, వాడకం, రవాణా, దిగుమతిపై తక్షణమే నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.


