News October 31, 2024

ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలి: మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివ్యమైన వెలుగుల పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలని కోరుకున్నారు. లక్ష్మీగణేశుల ఆశీర్వాదంతో అందరూ సంపన్నమవ్వాలని ప్రార్థించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రజలకు విషెస్ చెబుతున్నారు. ఏపీ Dy CM పవన్ కళ్యాణ్ పాక్, బంగ్లా‌, అఫ్గాన్‌లోని హిందువులకూ శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే.

Similar News

News February 18, 2026

AI కనెక్టివిటీకి భారత్‌కు గూగుల్ సబ్‌సీ కేబుల్స్

image

AI రంగంలో భారత్ అసాధారణ వృద్ధిని సాధిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో పేర్కొన్నారు. భారత్-US మధ్య AI కనెక్టివిటీని పెంచేందుకు సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టును ప్రకటించారు. $15 బిలియన్ల AI హబ్ ద్వారా భారత్‌లో భారీగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారత విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

News February 18, 2026

తన అనారోగ్య సమస్యను వివరించిన మమ్ముట్టి

image

గతేడాది తాను జ్ఞానేంద్రియాల సమస్య ఎదుర్కొన్నట్లు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వెల్లడించారు. ‘విన్పించడం, వాసన గుర్తించడం లాంటివి చాలాకాలం తెలియలేదు. నడిచేందుకూ ఇబ్బంది పడ్డా. చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మనిషికి జ్ఞానేంద్రియాలు గొప్ప వరమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా 2025లో షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవడంతో క్యాన్సర్ అని రూమర్స్ వచ్చాయి.

News February 18, 2026

అభిని పక్కనబెట్టి సంజూను తీసుకోవాలని డిమాండ్లు

image

అభిషేక్ శర్మ గత 7 అంతర్జాతీయ టీ20ల్లో 5 సార్లు (ఈ WCలో 3 సార్లు) డకౌట్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో ఇంత నిర్లక్ష్యంగా ఆడటం ఏంటని టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కీలకమైన సూపర్-8లో అభిని పక్కనబెట్టి సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?