News February 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News February 22, 2025
OCల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు: సీఎం రేవంత్

TG: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఓసీల సంఖ్యను ఎక్కువగా చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సర్వేలో 21 శాతం ఓసీలు ఉంటే తమ సర్వేలో 17 శాతమే ఉన్నట్టు తేలిందన్నారు. ప్రజాభవన్లో సీఎం మాట్లాడారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎందుకు సర్వేలో పాల్గొనలేదు. మేం ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎలా ప్రశ్నిస్తారు. గుజరాత్లో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చింది కనబడలేదా?’ అని సీఎం ఫైర్ అయ్యారు.
News February 22, 2025
అభిమానులకు ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చిన నటుడు

తెలుగు చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో ఒకరైన జగపతి బాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ ‘నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి చూద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇది పాఠశాల విద్యాభ్యాసం సమయంలో తోటి విద్యార్థులతో కలిసి ఏదో టూర్కు వెళ్లిన ఫొటోలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఫొటోలో జగపతి బాబు ఎక్కడున్నారో కామెంట్ చేయండి.
News February 22, 2025
ఇండియాకు SAMSUNG మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్?

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ‘SAMSUNG’ చైనాలోని తన మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఇండియాకు మార్చనున్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్లతో ఇబ్బందులు ఎదురవడంతో శామ్సంగ్ తన స్మార్ట్ఫోన్స్ ఉత్పత్తిని చైనా నుంచి ఇండియా/వియత్నాంకు తరలించాలని చూస్తోందని చెప్పారు. వియత్నాం కూడా US టారిఫ్ల ప్రమాదాన్ని ఎదుర్కోనుండటంతో INDకు మార్చడం బెటర్ అని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.