News September 16, 2024

వివ్ రిచ‌ర్డ్స్‌తో తల్లి సంబంధం వల్ల వేధింపులు ఎదుర్కొన్నా: మసాబా గుప్తా

image

విండీస్ క్రికెట‌ర్ వివ్ రిచ‌ర్డ్స్‌తో త‌న త‌ల్లికి ఉన్న సంబంధం వ‌ల్ల 7వ త‌ర‌గ‌తిలోనే వేధింపులకు గురైనట్టు నేనా గుప్తా కుమార్తె మ‌సాబా గుప్తా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న త‌ల్లి గ‌ర్భం దాల్చిన‌ప్పుడు త‌న‌ది అక్ర‌మ సంతానంగా భావిస్తూ నేనా గుప్తా త‌ల్లిదండ్రులు ఎవ‌రూ చూట్టూ లేర‌ని, త‌న తండ్రి రిచ‌ర్డ్స్ కూడా లేర‌న్నారు. తాను శారీరకంగా ఎలా ఉన్నది, లేదా ఎందుకలా ఉన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదన్నారు.

Similar News

News November 22, 2025

బ్లీచ్‌ చేయించుకుంటున్నారా?

image

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.

News November 22, 2025

హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

image

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.

News November 22, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.