News July 18, 2024

విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్య

image

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య-నటాషా తాము విడిపోయినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ‘మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. అగస్త్యకు(కుమారుడు) మంచి కో-పేరెంట్స్‌గా ఉంటాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను మీరు గౌరవిస్తూ, మద్దతివ్వాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. వీరు 2020 మే 31న వివాహం చేసుకున్నారు.

Similar News

News November 15, 2025

‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

image

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్‌లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

News November 15, 2025

KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

News November 15, 2025

రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

image

రైలులో తక్కువ ధరకే వస్తువులను <>పార్సిల్<<>> చేయొచ్చు. ‘పార్సిల్ అండ్ లగేజ్ సర్వీస్’ కింద వస్తువులు, కార్లు & బైక్స్‌ను రైలులో పంపొచ్చు. ఏ వస్తువునైనా దృఢమైన పెట్టెల్లో లేదా సంచుల్లో ప్యాక్ చేయాలి. బైక్ పంపిస్తే RC, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. బరువు & దూరం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. వారిచ్చిన రసీదును స్టేషన్‌లో చూపించి బైక్ కలెక్ట్ చేసుకోవచ్చు. ‘పార్సిల్ ఇన్సూరెన్స్’ తీసుకుంటే నష్టపరిహారం పొందొచ్చు.