News October 8, 2024
హార్దిక్ పాండ్య సరికొత్త ఘనత

టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సరికొత్త ఘనత సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు సిక్సర్తో మ్యాచ్ ముగించిన ప్లేయర్గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు ఆయన 5 సార్లు సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశారు. విరాట్ కోహ్లీ, ఫించ్, ఇయాన్ మోర్గాన్, తిసారా పెరీరా, రస్సెల్, షాయ్ హోప్ నాలుగేసి సార్లు సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించారు. కాగా ఈ ఏడాది హార్దిక్ టీ20ల్లో 214 పరుగులతోపాటు 14 వికెట్లు కూడా తీశారు.
Similar News
News January 24, 2026
APలో ఏర్పాటు కానున్న WEF C4IR కేంద్రం

AP: నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) 5 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అందులో ఒకటి రాష్ట్రంలో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇండియా(AP), ఫ్రాన్స్, UK, UAEలలో ఇవి ఏర్పాటు కానున్నాయి. WEF 2017లో ప్రారంభించిన 4వ పారిశ్రామిక విప్లవ నెట్వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమల సమన్వయానికి ఒక వేదికగా పనిచేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ తరహా సెంటర్స్ హైదరాబాద్, ముంబైలో ఉన్నాయి.
News January 24, 2026
సంతాన ప్రాప్తి కోసం రేపు ఏం చేయాలంటే..?

సంతాన ప్రాప్తి కోరేవారు రథ సప్తమి రోజు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. సూర్య నామాలు స్మరిస్తూ దాన్ని 7 రంగులతో నింపాలి. పద్మం మధ్యలో శివపార్వతులను ఉంచి, పక్కనే తెల్లని వస్త్రంపై సూర్యరథపు ప్రతిమను ఉంచి ఎర్రని పూలతో పూజించాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఏడాది పాటు ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ, సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఫలితం ఉంటుంది.
News January 24, 2026
కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.


