News December 19, 2024
అభివృద్ధిపై హరిరామ జోగయ్య బహిరంగ లేఖ

AP: పరిపాలనా, నివాస భవనాలు, పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం అభివృద్ధి కాదని మాజీ MP హరిరామజోగయ్య అన్నారు. రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒకే ప్రాంతంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని బహిరంగ లేఖ విడుదల చేశారు.
Similar News
News October 4, 2025
H-1B వీసాల ఫీజు పెంపుపై యూఎస్ కోర్టులో దావా

H-1B <<17767574>>వీసాల <<>>జారీని కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు లక్ష డాలర్ల ఫీజు విధించడాన్ని పలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ యూఎస్లోని శాన్ఫ్రాన్సిస్కో కోర్టును ఆశ్రయించాయి. ఆయన జారీ చేసిన ప్రకటనలో తప్పులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కేలా చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతున్న విషయం తెలిసిందే.
News October 4, 2025
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

వాస్తు అంటే నిర్మాణాల శాస్త్రం. ఇది ఇళ్లు, ఇతర భవనాల్లో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి మధ్య సమతుల్యతను సృష్టిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘చుట్టూ ఉన్న శక్తులను మన అభివృద్ధికి అనుకూలంగా మార్చేలా నిర్మాణాలు ఎలా చేయాలో వాస్తు సూచిస్తుంది. వాస్తు ప్రకారం నిర్మించిన/సరిచేసిన ఇంట్లో నివసిస్తే మానసిక ప్రశాంతతతో, ఆనందంగా, కోరుకున్న విధంగా జీవిస్తారు’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 4, 2025
శివుణ్ని, దక్షుడు ఎందుకు అవమానించాలని అనుకుంటాడు?

బ్రహ్మ కుమారుడే ‘దక్షుడు’. ఆయన ఓ గొప్ప ప్రజాపతి. సంప్రదాయాలు, నియమాలను గౌరవించే వ్యక్తి. ఆయన కూతురు సతీదేవి. ఆమెకు శివుడంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయనను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఆమె తండ్రి దక్షుడికి ఇష్టం ఉండదు. సంప్రదాయానికి పెద్ద పీట వేసే ఆయన శ్మశానాల్లో ఉంటూ.. భస్మం, పులి చర్మం ధరించే శివుణ్ని అల్లుడిగా అంగీకరించడు. అందుకే అవమానించాలని అనుకుంటాడు. <<-se>>#Shakthipeetam<<>>