News July 14, 2024

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

image

TG: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ MLA హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘గతంలో ఇదే డిమాండ్ భట్టి విక్రమార్క చేశారు. మీ ప్రకటనకు కట్టుబడి 1:100 చొప్పున ఎంపిక చేయాలి. గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలి. మెగా DSC, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగులకు రూ.4వేలు భృతి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News March 23, 2026

ఇవాళ ‘వాహన్’ పోర్టల్‌లోకి TG ఎంట్రీ

image

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్‌తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్‌ నేటి నుంచి రద్దవనుంది.

News March 23, 2026

షాకింగ్.. మాజీ ఎమ్మెల్యేపై కుల బహిష్కరణ

image

21వ శతాబ్దంలోనూ కుల జాడ్యం కొనసాగుతోంది. ఇందుకు సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులూ బలవుతున్నారు. తాజాగా ఒడిశాలో వేరే సామాజికవర్గం యువకుడితో కూతురి నిశ్చితార్థం చేసిన నవరంగపూర్ EX MLA సదాశివ ప్రధాన్ కుల బహిష్కరణకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని 12ఏళ్లపాటు వెలివేస్తున్నట్లు ఆల్ ఇండియా భత్రా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకటించింది. సామాజిక, సాంస్కృతిక, ఇతర ఫ్యామిలీ వేడుకల్లో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించింది.

News March 23, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

image

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.