News July 14, 2024

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

image

TG: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ MLA హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘గతంలో ఇదే డిమాండ్ భట్టి విక్రమార్క చేశారు. మీ ప్రకటనకు కట్టుబడి 1:100 చొప్పున ఎంపిక చేయాలి. గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలి. మెగా DSC, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగులకు రూ.4వేలు భృతి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

ఎన్నికల విధుల్లో వారికి మినహాయింపు: ADB కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత నోడల్ అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు, లాజిస్టిక్స్ అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు గర్భిణీలు, బాలింతలు, దివ్యాంగులు, అలాగే వచ్చే మార్చి నెలాఖరు నాటికి పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు.

News January 19, 2026

CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

image

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

image

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>