News November 6, 2024
ఒంటిపూట బడులు వద్దని హరీశ్ డిమాండ్

TG: కులగణన నుంచి ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను మినహాయించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. వారి సేవలను ఇలా వినియోగించుకోవడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. సర్వే కోసం స్కూళ్లను మధ్యాహ్నం వరకే నడపడం సరికాదన్నారు. అకస్మాత్తుగా <<14536930>>ఒంటిపూట<<>> బడులు నడపడం వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం దిగజారిపోతోందన్నారు.
Similar News
News December 13, 2025
కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.
News December 13, 2025
తిరుమలలో పరకామణి మీకు తెలుసా?

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే మొక్కుబడులు, కానుకలను లెక్కించే ప్రదేశమే ‘పరకామణి’. పూర్వం ఇది శ్రీవారి ఆలయం లోపల, ఆనంద నిలయం వెనుక ఉండేది. ప్రస్తుతం భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదురుగా పరకామణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల కానుకల లెక్కింపు నిరంతరం జరుగుతూ ఉంటుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 13, 2025
మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.


