News March 10, 2025

IPL-2025 నుంచి వైదొలిగిన హ్యారీ బ్రూక్

image

ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ తాను IPL-2025లో ఆడటం లేదని ప్రకటించారు. దేశానికి ఆడటమే తన ప్రాధాన్యత అని, రాబోయే సిరీస్‌ల కోసం ప్రిపేర్ అయ్యేందుకే IPLకు దూరం అవుతున్నట్లు పేర్కొన్నారు. 2024 వేలంలో అతడిని DC రూ.6.25కోట్లకు కొనుగోలు చేసింది. ఆక్షన్‌లో ఎంపికై టోర్నీలో పాల్గొనకపోతే రెండేళ్ల నిషేధం విధిస్తామని IPL ఇటీవల కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. దీంతో అతడిపై రెండు సీజన్ల పాటు బ్యాన్ ఉండనుంది.

Similar News

News March 10, 2025

భారత్ బ్రహ్మాస్త్రం: గంటలో USను చేరగల వేగం!

image

భారత్ అద్భుతం చేసింది. 1500KM రేంజుతో గంటకు 12,144 KMPH వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. అంటే ఢిల్లీ నుంచి వాషింగ్టన్‌‌కు గంటలో చేరగల వేగమిది. ఈ లాంగ్‌రేంజ్ యాంటీషిప్ మిసైల్ (LRAShM)ను 2023, NOV 16న విజయవంతంగా పరీక్షించిన DRDO తాజాగా మరోసారి సత్తా చూపింది. ఇది ధ్వని కన్నా 10రెట్లు అంటే సెకనుకు 3.37KM, ముంబై నుంచి కరాచీకి 5ని.ల్లో వెళ్లగలదు. చైనా, US కన్నా ఇదే బెస్ట్.

News March 10, 2025

ప్రణయ్ హత్య కేసు నిందితులు వీరే

image

A1 మారుతీరావు (అమృత తండ్రి), A2 సుభాష్ శర్మ(బిహార్), A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్), A8 నిజాం (ఆటో డ్రైవర్). కరీం సాయంతో అస్గర్‌కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో <<15710208>>ప్రణయ్‌ను<<>> హత్య చేయించాడు.

News March 10, 2025

ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

image

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.

error: Content is protected !!