News September 25, 2024
డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి

తనపై నార్సింగి పీఎస్లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్కు తెలుసు’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News December 23, 2025
టాప్ స్టోరీస్

* పరిషత్ ఎన్నికలపై త్వరలో నిర్ణయం: CM రేవంత్
* కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తుంది: CM చంద్రబాబు
* వైసీపీని పర్మినెంట్గా అధికారానికి దూరం చేస్తా: పవన్
* ఏపీ పెట్టుబడులపై KCR వ్యాఖ్యల దుమారం.. మంత్రుల ఫైర్
* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత
* ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
* భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
News December 23, 2025
పార్టీ, పదవుల కన్నా ప్రజలే ముఖ్యం: పవన్

AP: పార్టీ, పదవుల కన్నా నమ్మిన ప్రజలే తనకు ముఖ్యమని Dy.CM పవన్ అన్నారు. ‘పదవులు అలంకారం కాదు బాధ్యత. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించను. సంఘ విద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తోంది. అధికారులకు మళ్లీ చెబుతున్నా వైసీపీ మళ్లీ రాదు. పిల్లలకు కులాలను అంటగట్టి రాజకీయం చేస్తున్నారు. పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం’ అని జనసేన పదవి-బాధ్యత కార్యక్రమంలో తెలిపారు.
News December 23, 2025
నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్(D) రసూల్పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.


