News October 9, 2024
హరియాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటే: జగన్

AP: హరియాణా ఎన్నికలు కూడా AP తరహాలోనే జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిది. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు న్యాయనిపుణులు ముందుకు రావాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 24, 2025
BELలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 24, 2025
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 26,210 వద్ద.. సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 85,611 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ఫైనాన్స్, NTPC, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్బ్యాంక్ షేర్లు లాభాల్లో.. టెక్మహీంద్రా, ఇన్ఫీ, TMPV, సన్ఫార్మా, HCL టెక్ నష్టాల్లో ఉన్నాయి.
News December 24, 2025
విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.


