News April 4, 2025

హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

image

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Similar News

News April 11, 2025

భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా?: మహేశ్

image

IMG బిల్లీరావు దగ్గర కమీషన్ తీసుకున్నందుకే కంచ గచ్చిబౌలి భూముల కోసం BRS పోరాడలేదని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలు సాధించిందని, వాటిలో కంపెనీలు నిర్మిస్తే యువతకు ఉద్యోగాలొస్తాయన్నారు. గత ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలు అమ్ముకోగా, లక్షఎకరాలు డీఫారెస్ట్ చేసిందన్నారు. BRS హయాంలో జరిగిన భూదోపిడీపై KTR చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

News April 11, 2025

క్రికెట్‌లో త్వరలో కొత్త రూల్స్!

image

కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ICC కసరత్తు చేస్తోంది. వన్డేల్లో రెండు కొత్త బంతుల రూల్‌ను సవరించనుంది. దీని ప్రకారం బౌలింగ్ టీమ్ 2 న్యూ బాల్స్‌తో ఆటను ఆరంభించవచ్చు. 25 ఓవర్ల తర్వాత వాటిలో ఒక్క దానినే కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే టెస్టుల్లో ఒక్క రోజులో 90 ఓవర్లు పూర్తయ్యేలా ఓవర్ల మధ్య 60sec మాత్రమే విరామం ఉండేలా టైమర్‌ను తీసుకురానుంది. అటు మెన్స్ U19 WCను T20 ఫార్మాట్‌కు మార్చాలని యోచిస్తోంది.

News April 11, 2025

రేపు సెలవు రద్దు

image

AP: రేపు (రెండో శనివారం) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. ఏప్రిల్ 12ను వర్కింగ్ డేగా ప్రకటిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసింది. రేపు ఉ.11 గం. నుంచి సా.5.30 వరకు ఆఫీసులు పని చేయనున్నాయి. హాలిడే సమయాల్లో రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రేపు మాత్రం రూ.5వేలు తీసుకోకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది.

error: Content is protected !!