News March 30, 2024
పాండ్యపై ద్వేషం సరికాదు: అశ్విన్

రోహిత్ స్థానంలో MI కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాండ్యపై అభిమానుల ద్వేషం సరికాదని భారత క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్లపై చేసే కామెంట్స్ చూస్తుంటే క్రికెట్లో నెలకొన్న ద్వేషపూరిత వాతావరణం తెలుస్తుంది. గంగూలీ కింద సచిన్ ఆడారు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురు కుంబ్లే కెప్టెన్సీలో.. మళ్లీ వాళ్లంతా ధోనీ సారథ్యంలో ఆడారు’ అని అశ్విన్ గుర్తు చేశారు.
Similar News
News April 14, 2026
కోర్టుల్లో బెంచ్ల గురించి తెలుసా?

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్లు ఉంటాయి. డివిజన్ బెంచ్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్స్టిట్యూషన్ బెంచ్లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్లు ఉంటాయి.
News April 14, 2026
T20 కెప్టెన్గా సూర్య కొనసాగుతారా?

భారత T20 కెప్టెన్గా సూర్య ఎప్పటివరకు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కెప్టెన్సీలోనే భారత్ T20 WC గెలిచింది. కానీ బ్యాటింగ్లో ఆయన తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జులైలో ENG, IREతో జరిగే T20 సిరీస్లలో ఆయన ఎలా ఆడతారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్లలో రాణిస్తే ఆయన 2028 ఒలింపిక్స్ వరకూ కెప్టెన్గా కొనసాగే అవకాశముందని అంటున్నారు.
News April 14, 2026
కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టేలా పరీక్షలు: మంత్రి

AP: ఉద్ధానం వాసులను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘బయోమార్కర్స్’ ద్వారా జన్యు, రక్త, మూత్ర పరీక్షలను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇందుకు ICMR ₹6.2CR ఇచ్చింది. వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పలాస రీసెర్చ్ కేంద్రం సహా విశాఖ KGHలో ప్రత్యేక ల్యాబ్లు నెలకొల్పాం’ అని తెలిపారు.


