News March 30, 2024
పాండ్యపై ద్వేషం సరికాదు: అశ్విన్

రోహిత్ స్థానంలో MI కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాండ్యపై అభిమానుల ద్వేషం సరికాదని భారత క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్లపై చేసే కామెంట్స్ చూస్తుంటే క్రికెట్లో నెలకొన్న ద్వేషపూరిత వాతావరణం తెలుస్తుంది. గంగూలీ కింద సచిన్ ఆడారు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురు కుంబ్లే కెప్టెన్సీలో.. మళ్లీ వాళ్లంతా ధోనీ సారథ్యంలో ఆడారు’ అని అశ్విన్ గుర్తు చేశారు.
Similar News
News November 23, 2025
భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News November 23, 2025
‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఎలా ఉందంటే?

OTTలో ట్రెండింగ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ విడుదలైంది. ఈశాన్య భారతంలో నడిచే కథతో దర్శకులు రాజ్, డీకే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. మనోజ్ బాజ్పాయ్ నటన, విజయ్ సేతుపతి క్యామియో, కొత్త పాత్రల్లో జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ అదరగొట్టారు. గత సీజన్లతో పోలిస్తే యాక్షన్ తక్కువగా ఉండటం, బలమైన కథ లేకపోవడం నిరాశపరుస్తాయి. చివర్లో సీజన్ 4 ఉందని హింట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది?
News November 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 75 సమాధానాలు

ప్రశ్న: పాండవుల పక్షం వహించిన దృతరాష్ట్రుడి పుత్రుడెవరు?
జవాబు: పాండవుల తరఫున యుద్ధం చేసిన దృతరాష్ట్రుడి పుత్రుడు ‘యుయుత్సుడు’. ఆయన గాంధారి దాసి సుఖదకు జన్మించాడు. దాసీ పుత్రుడు అయినందుకు కౌరవులు దూరం పెట్టేవారు. ద్రౌపతి వస్త్రాపహరణాన్ని అడ్డుకున్నాడు. ధర్మంవైపు నిలిచి కౌరవులతో పోరాడాడు. కురుక్షేత్రంలో మరణించని కౌరవ వీరుడిగా నిలిచారు. ఆ తర్వాత హస్తినాకు సైన్యాధిపతిగా నియమించారు. <<-se>>#Ithihasaluquiz<<>>


