News December 27, 2024
పార్టీ శ్రేణుల అంకితభావానికి హ్యాట్సాఫ్: జగన్

AP: కరెంట్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ YCP శ్రేణులు చేపట్టిన నిరసనలు విజయవంతం అయ్యాయని YS జగన్ ట్వీట్ చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. పార్టీ పిలుపుతో ప్రజలకు బాసటగా నిలుస్తూ ప్రతి నియోజకవర్గంలో గొప్పగా కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. ప్రజల పక్షంగా ప్రజా సమస్యల పట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావం, చిత్తశుద్ధికి జగన్ హ్యాట్సాఫ్ తెలిపారు.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


