News December 27, 2024
పార్టీ శ్రేణుల అంకితభావానికి హ్యాట్సాఫ్: జగన్

AP: కరెంట్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ YCP శ్రేణులు చేపట్టిన నిరసనలు విజయవంతం అయ్యాయని YS జగన్ ట్వీట్ చేశారు. ఈ నిరసనల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. పార్టీ పిలుపుతో ప్రజలకు బాసటగా నిలుస్తూ ప్రతి నియోజకవర్గంలో గొప్పగా కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. ప్రజల పక్షంగా ప్రజా సమస్యల పట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావం, చిత్తశుద్ధికి జగన్ హ్యాట్సాఫ్ తెలిపారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


