News October 10, 2024
ఏపీకి వెళ్లాల్సిందే.. IASల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం
తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News October 10, 2024
వారిద్దరూ ఛాన్సులు వేస్ట్ చేసుకుంటున్నారు: ఆకాశ్ చోప్రా
బంగ్లాతో టీ20 సిరీస్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శాంసన్ అవకాశాల్ని వృథా చేసుకుంటున్నారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉందని గుర్తు చేశారు. ‘వారికి విలువైన 2 ఛాన్సులు అయిపోయాయి. తమ వికెట్ను పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు చూడాలి. సౌతాఫ్రికా టూర్కి జైస్వాల్, గిల్, రుతురాజ్ రెడీగా ఉంటారు. ఇషాన్ కిషాన్ కూడా రేసులోకి రావొచ్చు’ అని అంచనా వేశారు.
News October 10, 2024
రాష్ట్రంలో 604 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు
AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీచర్ జాబ్లు 507, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PG, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై, 18-42 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది.
వెబ్సైట్: https://apkgbv.apcfss.in/
News October 10, 2024
25 నుంచి మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన
AP: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.