News October 10, 2024

ఏపీకి వెళ్లాల్సిందే.. IASల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం

image

తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News October 17, 2025

పిల్లలను స్కూల్‌కు పంపేందుకు ఇంత కష్టపడుతున్నారా?

image

పిల్లలను తయారుచేసి బడికి పంపే సమయంలో మనం చేసే హడావిడి.. మారథాన్‌లో పరిగెత్తడానికి సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు 3,000 క్యాలరీల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. పిల్లలను బట్టలు వేసుకోమని బతిమాలడం, అరవడంలో తల్లిదండ్రులు ఖర్చుచేసే శక్తి ‘మారథాన్‌లో పరుగెత్తడం, కోపంగా ఉన్న ఎలుగుబంటితో పోరాడినంత పనే’ అని ప్రొఫెసర్ ఓలాన్ విచ్ వివరించారు. మీరూ ఇలా కష్టపడతారా?

News October 17, 2025

వాస్తు నియమాలు పాటిస్తే అనుకున్నది జరుగుతుందా?

image

వాస్తు నియమాలు పాటించినంత మాత్రాన అనుకున్నది జరిగిపోదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. కల సాకారం కావాలంటే కృషి, పట్టుదల, సరైన ప్రణాళిక కూడా ఉండాలన్నారు. ‘వాస్తు చుట్టూరా వాతావరణాన్ని మనకు సానుకూలంగా మలచి, ఉత్సాహంగా, ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. శ్రమకు, వాస్తు తోడైతే సఫలీకృత ప్రయత్నాలు తప్పక విజయవంతం అవుతాయని వాస్తు శాస్త్రం బోధిస్తోంది’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>

News October 17, 2025

లోకేశ్‌ ట్వీట్‌కు కౌంటరిచ్చిన సిద్దరామయ్య

image

APలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>ట్వీట్‌<<>> తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కర్ణాటక CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు. ‘ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారు. యాపిల్ సంస్థ కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు లోకేశ్‌ను ఎద్దేవా చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు KN, TN నెటిజన్లు <<18027162>>ట్వీట్లు<<>> చేశారు.