News November 22, 2024
మణిపుర్లో మీ చిదంబరం చేసింది మర్చిపోయారా: ఖర్గేపై నడ్డా ఫైర్

మణిపుర్ పరిస్థితిని కాంగ్రెస్ సెన్సేషనల్ చేయడానికి పదేపదే ప్రయత్నించడం షాకింగ్గా ఉందని BJP చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ రాయడంపై మండిపడ్డారు. ‘విదేశీ మిలిటెంట్ల అక్రమ వలసల్ని చట్టబద్ధం చేసింది, వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నదే అప్పటి HM, మీ చిదంబరం అని మర్చిపోయారేమో. దేశాన్ని అస్థిరపరిచే విదేశీ శక్తులకు మీరు వత్తాసు పలకడం ఆందోళనకరం’ అని అన్నారు.
Similar News
News December 26, 2025
శిల్పాశెట్టి అసభ్యకర వీడియోలు.. వెంటనే తొలగించాలన్న కోర్టు

AI ఉపయోగించి తయారుచేసిన నటి శిల్పాశెట్టి డీప్ఫేక్ వీడియోల URLs, లింక్స్, పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని సంబంధిత సైట్లను బాంబే HC ఆదేశించింది. ఆన్లైన్లో ఉన్న తన అసభ్యకర ఫొటోలు, వీడియోలను తొలగించాలని శిల్ప వేసిన పిటిషన్ను జస్టిస్ అద్వైత్ ఎం సేథ్నా వెకేషన్ బెంచ్ విచారించింది. ప్రాథమిక గోప్యత హక్కును ప్రభావితం చేసేలా ఒక వ్యక్తి/వ్యక్తిత్వాన్ని చిత్రీకరించకూడదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 26, 2025
AI డిమాండ్కు AP సిద్ధంగా ఉంది: లోకేశ్

భారత ఉద్యోగులు AI టూల్స్ను అడాప్ట్ చేసుకోవడంలో అన్ని దేశాలను దాటేశారన్న వార్తపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘AI అడాప్షన్లో భారత్ దూసుకుపోవడం యాదృచ్ఛికం కాదు. గవర్నెన్స్, ఫిన్టెక్, హెల్త్, మొబిలిటీ వంటి అంశాల్లో వినియోగ స్థాయిని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ డిమాండ్ AI హబ్స్, డేటా సెంటర్స్ ఏర్పాటుకు తోడ్పడనుంది. AI రెడీ DC ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ల్యాండ్తో AP సిద్ధం’ అని ట్వీట్ చేశారు.
News December 26, 2025
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ

TGలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని తేల్చిచెప్పింది. ప్రస్తుతం లబ్ధిదారులకు మాత్రమే సాయం అందేలా గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, సర్కార్ ఎలాంటి షరతులు విధించలేదని స్పష్టం చేసింది.


