News August 2, 2024
మీ అకౌంట్లోకి రిఫండ్ డబ్బులు వచ్చాయా?

ITR ఫైల్ చేసిన కొందరి ఖాతాల్లో IT శాఖ రిఫండ్ డబ్బులు జమ చేస్తోంది. రిటర్న్ ఫైల్ అయిన 2-3 రోజుల్లోనే కొందరికి రిఫండ్ అందింది. ఈ-వెరిఫై చేయకపోవడం, రిటర్నులపై అదనపు సమాచారం ఇవ్వకపోవడం, బ్యాంక్ ఖాతాలు సరిగా లేకపోవడం, ఫారం 26ASలో ఉన్న వివరాలు-రిటర్నులలో ఉన్న సమాచారంలో వ్యత్యాసాలు ఉండటంతో రిటర్నులు సమర్పించిన కొందరికి డబ్బు జమ కాలేదు. పోర్టల్లో లాగిన్ అయ్యి మీ రిటర్నుల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News October 22, 2025
గూగుల్ క్రోమ్కు పోటీగా ‘అట్లాస్’

గూగుల్ క్రోమ్కు పోటీగా OpenAI ‘అట్లాస్’ అనే సొంత వెబ్ బ్రౌజర్ను లాంచ్ చేసింది. AI చాట్బాట్ ChatGPT ద్వారా వరల్డ్లో మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్గా OpenAI ఎదిగింది. ఇప్పుడు యూజర్లను పెంచుకుని డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా రెవెన్యూ ఆర్జించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్టాప్స్లో ‘అట్లాస్’ను లాంచ్ చేయగా త్వరలో మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్ iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.
News October 22, 2025
ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయురాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ యాత్ర చేపట్టి, 7 ప్రపంచరికార్డులు సృష్టించారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. పద్మశ్రీ, అర్జున అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, 1984లో పద్మభూషణ్, లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ మొదటి అవార్డు అందుకున్నారు.
News October 22, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.