News March 17, 2025

200 ఏళ్లనాటి పనస చెట్టును చూశారా?

image

TNలోని కడలూరులో పన్రుటి ప్రాంతం పనస పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 4వేల మందికిపైగా రైతులు 800 హెక్టార్లలో వీటిని పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 200 ఏళ్లనాటి పనస వృక్షం ఫొటోను ఓ ఫారెస్ట్ అధికారి షేర్ చేస్తూ ఇది ఏటా 200 పండ్లు అందిస్తోందని తెలిపారు. కాగా, ఫైబర్, ఖనిజాలతో కూడిన పోషకాహారాలు పనస పండులో మెండుగా ఉండటంతో వీటి పెంపకానికి తమిళనాడు ప్రభుత్వం ‘జాక్‌ఫ్రూట్ మిషన్’ను ప్రారంభించింది.

Similar News

News November 24, 2025

UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>UCIL<<>>)107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ కాంపిటెన్సీ, మైనింగ్ మేట్, ఫోర్‌మెన్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ucil.gov.in/

News November 24, 2025

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

News November 24, 2025

VIRAL: ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్

image

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్‌పూర్‌లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.