News August 8, 2025

మీ జన్ ధన్ ఖాతా KYC అప్‌డేట్ చేయించారా?

image

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు రీ-కేవైసీ చేయించాలని RBI సూచించింది. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ క్యాంపులకు వెళ్లి అడ్రస్, ఫోన్ నంబర్ వంటి వివరాలతో KYC అప్‌డేట్ చేయించుకోవచ్చు. లేదా మీరే ఆన్‌లైన్‌(మీ బ్యాంక్ వెబ్‌సైట్)లో చేసుకోవచ్చు. 2014లో ఈ స్కీమును ప్రారంభించగా, దేశంలో ప్రస్తుతం 55.9 కోట్ల ఖాతాలున్నాయి.

Similar News

News August 8, 2025

చంద్రబాబు ఆటలో సునీత కీలుబొమ్మ: మేరుగు

image

AP: సీఎం చంద్రబాబు ఆటలో వైఎస్ సునీత ఓ కీలుబొమ్మ అని వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు. తన తండ్రిని ఓడించినవారికి ఆమె ఎలా మద్దతిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునీత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవినాశ్ రెడ్డిని బలిపశువును చేస్తున్నారు. వివేకా హత్య కేసును వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎవరి ప్రోద్భలంతో సునీత ఇదంతా చేస్తున్నారు?’ అంటూ ఆయన ప్రశ్నించారు.

News August 8, 2025

ఓ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా

image

మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ స్టార్ హీరో తనను అవమానించారని, అరుస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆమె చెప్పారు. అసౌకర్యంగా ఫీలయ్యే సన్నివేశంలో నటించనని చెప్పినందుకు తనపై కోప్పడినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం తమన్నా వెల్లడించలేదు.

News August 8, 2025

పండగ వేళ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు!

image

TG: రాఖీ పండగ వేళ ప్రత్యేక బస్సుల్లో RTC 30% వరకు ఛార్జీలు పెంచింది. అయితే పండగల సీజన్లో టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఉందని RTC అధికారులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇవాళ మహబూబాబాద్(D) తొర్రూర్ వెళ్లేందుకు HYD ఉప్పల్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. టికెట్ ఒకరికి రూ.220 అయితే రూ.330(ఇద్దరికి రూ.660) వసూలు చేశారని వాపోయారు. మహిళలకు ఫ్రీ బస్సు కల్పించి పురుషులపై ఆ భారం మోపుతున్నారని మండిపడ్డారు.