News January 30, 2025

తల్లిదండ్రులూ ఇది గమనించారా?

image

మీ ఇంట్లో ముగ్గురు పిల్లలున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించే ఉంటారు. ముగ్గురిలో మధ్యలో ఉన్న పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారని పరిశోధనలో తేలింది. వీరు తోబుట్టువులతో ఎంతో నిజాయతీగా, వినయంతో ఉంటారని, అంగీకారయోగ్యమైన వారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారు గొడవలు జరగకుండా చూస్తూ కుటుంబ వ్యవహారాలను సమతుల్యం చేస్తారని తెలిపాయి. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 16, 2025

USలో మండుతున్న ధరలు.. సుంకాలు తగ్గించిన ట్రంప్

image

భారత్‌పై అదనపు సుంకాలు వేయడంతో అమెరికాలో పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. దాదాపు 200 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించారు. ఇందులో భారత్‌ ఎగుమతి చేసే టీ, మిరియాలు, జీలకర్ర, యాలకులు, పసుపు, అల్లం, జీడిపప్పు, మామిడి వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ సడలింపు భారత వ్యవసాయ ఎగుమతులకు పెద్ద ఊతమిస్తుంది. సీ ఫుడ్, బాస్మతి రైస్‌పై తగ్గించలేదు.

News November 16, 2025

ఓట్ల కోసం ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లింపు: PK

image

బిహార్‌లో ఓటమి తర్వాత JSP చీఫ్ ప్రశాంత్ కిశోర్ NDAపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన రూ.14,000 కోట్లను ఎన్నికల సమయంలో మళ్లించారని ఆరోపించారు. వాటిని మహిళల ఖాతాల్లోకి రూ.10వేల చొప్పున జమ చేశారన్నారు. జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ప్రభుత్వం ఓట్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దీనిపై EC దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

News November 16, 2025

ICDS అనంతపురంలో ఉద్యోగాలు

image

ఏపీ: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌ 4 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/