News July 5, 2024
30 ఏళ్లలో ఒక్క చీర కూడా కొనలేదు: సుధా మూర్తి

గత 30 ఏళ్లలో తాను ఒక్క చీర కూడా కొనలేదని రాజ్యసభ MP సుధామూర్తి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఉన్నవాటినే మళ్లీమళ్లీ కట్టుకుంటానన్నారు. ‘గంగానదిలో నచ్చినది వదిలేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో నాకు ఇష్టమైన షాపింగ్ను కాశీ యాత్రకు వెళ్లినప్పుడు వదిలేశా. అప్పట్నుండి పెద్దగా షాపింగ్ చేయలేదు. మా అమ్మలా పొదుపుగా జీవించాలనుకున్నా. అక్కాచెల్లెళ్లు, స్నేహితులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తుంటా’ అని అన్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


