News April 2, 2025

HCUకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పిలుపు

image

HCU విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడాన్ని BJYM నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా BJYM ఆందోళనకు పిలుపునిచ్చింది. సీఎంకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నామని రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Similar News

News April 10, 2025

HYD: చికెన్, మటన్ షాపులు బంద్

image

గ్రేటర్‌ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT

News April 10, 2025

HYD: నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

image

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.

News April 9, 2025

HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

image

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

error: Content is protected !!