News April 2, 2025
HCU భూములు కాపాడండి.. మెదక్ ఎంపీ విజ్ఞప్తి

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) భూములను విక్రయించడంలో జోక్య చేసుకుని చర్య తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. టీబీజేపీకి చెందిన సహచర ఎంపీలతో కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఈ నిర్ణయం విశ్వవిద్యాలయం, విద్యార్థులు, సమాజంపై చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తుందన్నారు.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
మాజీ నక్సలైట్ సిద్ధన్న హత్య ఘటనాస్థలి పరిశీలించిన ఎస్పీ

పీపుల్స్ వార్ గ్రూపు మాజీ నక్సలైట్ సిద్దన్న అలియాస్ బల్లెపు నరసయ్య హత్యకు గురైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం పరిశీలించారు. జగిత్యాలకు చెందిన జక్కుల సంతోష్ అనే వ్యక్తి యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసం అని నమ్మించి సిద్ధన్నను అగ్రహారం గుట్టల్లోకి రప్పించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వేములవాడ పోలీసులకు పలు సూచనలు చేశారు.
News November 28, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు 35 కొత్త కంప్యూటర్లు

పెద్దపల్లి జిల్లా పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ 35 డెల్ వాస్ట్రో i3 కంప్యూటర్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కలెక్టర్ అనుమతితో వచ్చిన ఈ కంప్యూటర్లు నవంబర్ 30లోపు సంబంధిత పాఠశాలలకు చేరేలా టీమ్లను ఏర్పాటు చేయాలని శాఖ ఆదేశించింది. పంపిణీ చర్యలపై వివరాల కోసం SIET సెక్షన్ అధికారి మల్లేష్ గౌడ్ (9959262737) ను సంప్రదించాలని ప్రకటించింది.


