News April 2, 2025

HCU భూముల అమ్మకం ఆపాలి: MLC అంజిరెడ్డి

image

HCU భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పట్టభద్రుల MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. HCU భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. HCUలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని అలాంటి భూమి అమ్మడం ద్వారా హైదరాబాద్‌లో అనేక అనర్థాలు, కాలుష్యాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

Similar News

News December 18, 2025

పరిషత్ పోరుకు ‘ఓడిన’ అభ్యర్థులు ‘సై’..!

image

గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడే పరిషత్ సెగ మొదలైంది. పంచాయతీ పోరులో చేదు అనుభవం ఎదురైన అభ్యర్థులు ఇప్పుడు MPTC, ZPTC స్థానాలపై కన్నేశారు. త్వరలోనే ఈ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లాలోని 556 ఎంపీటీసీ, 66 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. గ్రామీణ రాజకీయాల్లో పట్టు నిలుపుకునేందుకు ఇప్పట్నుంచే రంగంలోకి దిగుతున్నారు.

News December 18, 2025

టాప్-2లో నెల్లూరు జిల్లా..!

image

నెల్లూరు జిల్లాకు 2025-26 GDDP టార్గెట్ రూ.92,641కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.36,766కోట్లతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాకు 79/100 మార్కులొచ్చాయి. 2025-26లో రూ.2952కోట్ల పాల దిగుబడులతో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 97వేల ఇళ్లను మంజూరు చేయగా 68వేలు గ్రౌండింగ్ అయ్యాయి. 43వేల ఇళ్లను పూర్తి చేశామంటూ జిల్లా వివరాలను CMకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు.

News December 18, 2025

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ హవా

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 7 మండలాల పరిధిలోని 152 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ మద్దతుదారులు ఏకంగా 102స్థానాల్లో విజయం సాధించారు. BRS 37, BJP 1, ఇతరులు 12 చోట్ల గెలుపొందారు. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. చారకొండ మండలంలో మాత్రం కాంగ్రెస్‌, BRS మధ్య పోరు హోరాహోరీగా సాగింది.