News April 1, 2025

HCU భూముల వేలం వివాదం.. CM అత్యవసర సమావేశం

image

TG: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో CM రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి హాజరయ్యారు. HCU భూముల వేలంపై వివాదం నెలకొనడంపై ఆయన వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంపై వెనక్కి తగ్గుతారా? లేక మరింత దూకుడుగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తి మారింది. మరోవైపు భూముల వేలాన్ని ఆపేయాలంటూ BRS, BJP నేతలు ఇవాళ ఆందోళనకు దిగారు.

Similar News

News December 1, 2025

రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

image

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News December 1, 2025

అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.

News December 1, 2025

భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

image

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.