News April 7, 2025

వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

image

HDFCలో లోన్లు(హోమ్, పర్సనల్, వెహికల్) తీసుకున్న వారికి శుభవార్త. వడ్డీ రేట్లపై 10 బేసిక్ పాయింట్లను బ్యాంక్ తగ్గించింది. దీంతో ఒక్క రోజు నుంచి మూడేళ్ల వ్యవధిలోని లోన్లపై వడ్డీ 9.10 నుంచి 9.35 శాతం మధ్య ఉండనుంది. గతంలో ఈ రేట్లు 9.20-9.45 శాతంగా ఉండేవి. ఇవాళ్టి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

Similar News

News April 9, 2025

ధోనీ ఔటయ్యారని భోరున విలపించింది!

image

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ పోరాడినప్పటికీ చెన్నైని గెలిపించలేకపోయారు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. కాగా.. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 12 బంతులాడిన MS 3 సిక్సులు, ఒక ఫోర్‌తో 27 రన్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ఆయనలో ఇదివరకటి ఆట ఇంకా అలాగే ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News April 9, 2025

రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.

News April 9, 2025

ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

image

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.

error: Content is protected !!