News July 24, 2024
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన HDFC

ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో FD ఖాతాదారుల్లో గరిష్ఠంగా సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90% వడ్డీ లభిస్తుంది. నేటి నుంచే ఈ పెంచిన రేట్లు అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు వివరించింది.
Similar News
News December 19, 2025
మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

నిర్వహణ లోపం వల్ల కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.
News December 19, 2025
మూడు నెలల్లో ఒకే గ్రామంలో 27వేల జననాలు.. తీరా చూస్తే!

MH యావత్మల్(D) శేందుర్సనీ GPలో గత మూడు నెలల వ్యవధిలో ఏకంగా 27,397 జననాలు నమోదవ్వడం కలకలం రేపింది. 1,500 మంది ఉండే ఈ గ్రామంలో ఈ సంఖ్యలో జననాలు ఉండటం సైబర్ కుట్రగా అధికారులు భావిస్తున్నారు. వీటిలో 99శాతం ఎంట్రీలు వెస్ట్ బెంగాల్, UP నుంచే ఉన్నాయని BJP నేత కిరీట్ సోమయ్య అన్నారు. ఈ విషయంపై CMతో మాట్లాడి బర్త్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా దీనిపై కేసు నమోదైంది.
News December 19, 2025
e-KYC లేకపోయినా బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

TG: రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.


