News September 20, 2024
పెళ్లి పేరుతో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు!
పెళ్లి పేరుతో ఓ జడ్జి సహా 50మందికి పైగా మహిళల్ని మోసం చేసిన UP వ్యక్తి ముకీమ్ఖాన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ క్రియేట్ చేసి ఫేక్ IDలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. పెళ్లి ఫిక్సయ్యాక మ్యారేజ్ హాల్స్ బుకింగ్, ఇతర కారణాలు చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యేవాడు. పెళ్లి కాని, వితంతు ముస్లిం మహిళల్నే తాను టార్గెట్ చేసినట్లు విచారణలో తెలిపాడు.
Similar News
News September 20, 2024
గ్రీస్లో ఇష్టమొచ్చినట్టు ఇళ్లు కొంటున్న ఇండియన్స్
జులై, ఆగస్టులో గ్రీస్లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.
News September 20, 2024
సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్
భారత సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురైంది. ఇందులో అమెరికాకు చెందిన రిపిల్ అనే డిజిటల్ చెల్లింపుల సంస్థకు సంబంధించిన XRP, క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలను హ్యాకర్లు పోస్టు చేశారు. కేసుల విచారణను ప్రసారం చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ను సుప్రీం కోర్టు వినియోగిస్తోంది.
News September 20, 2024
మధ్యాహ్నం జగన్ ప్రెస్మీట్!
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంపై, కూటమి 100 రోజుల పాలన తీరుపై ఆయన మీడియాతో మాట్లాడతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.