News September 20, 2024

పెళ్లి పేరుతో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు!

image

పెళ్లి పేరుతో ఓ జడ్జి సహా 50మందికి పైగా మహిళల్ని మోసం చేసిన UP వ్యక్తి ముకీమ్‌ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి ఫేక్ IDలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. పెళ్లి ఫిక్సయ్యాక మ్యారేజ్ హాల్స్ బుకింగ్, ఇతర కారణాలు చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యేవాడు. పెళ్లి కాని, వితంతు ముస్లిం మహిళల్నే తాను టార్గెట్ చేసినట్లు విచారణలో తెలిపాడు.

Similar News

News December 6, 2025

బిగ్‌బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

image

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.

News December 6, 2025

మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

image

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్‌ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్‌ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.

News December 6, 2025

MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

image

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.