News March 28, 2024
ఇతడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్కు ఆదర్శం
చాలామంది ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం రాకపోతే డిప్రెషన్లోకి వెళతారు. అలాంటి వారికి గోవాకు చెందిన లిండన్ కార్డొసో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంజినీరింగ్ చదివిన లిండన్ 2013లో హాస్టల్లో వాటర్ హీటర్ వేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చేతులు కోల్పోయారు. 3నెలలు ఆసుపత్రి బెడ్పైనే ఉన్నారు. కట్ చేస్తే.. ఇటీవల GSPC ఎగ్జామ్ క్లియర్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్లో డి.డైరెక్టర్గా అయ్యారు.
Similar News
News October 4, 2024
‘ఎమర్జెన్సీ’ విడుదలకు తొలగిన అడ్డంకులు!
కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. సర్టిఫికేషన్ సంబంధిత సమస్యలను CBFCతో పరిష్కరించుకున్నట్టు చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టుకు తెలిపారు. బోర్డు సూచించిన మార్పులకు ఫిలిం మేకర్స్ అంగీకరించారు. అన్ని మార్పులతో కూడిన చిత్రం కాపీని బోర్డు మరోసారి వీక్షించనుంది. ఈ ప్రక్రియతో సర్టిఫికెట్ జారీకి 14 రోజులు పడుతుందని కోర్టుకు బోర్డు తెలిపింది.
News October 4, 2024
భారత్ టార్గెట్ ఎంతంటే?
మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ముందు న్యూజిలాండ్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా కివీస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు ప్లిమ్మర్(34), బేట్స్(27) శుభారంభాన్ని ఇచ్చారు. మరో బ్యాటర్ డివైన్ (57) అర్థసెంచరీ చేయడంతో NZ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక 2, అరుంధతి, శోభన తలో వికెట్ తీశారు.
News October 4, 2024
BIG BREAKING: భారీ ఎన్కౌంటర్.. 36 మంది మృతి
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దుల్లో మావోలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టారు. వారికి మావోలు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు మరణించారు.