News September 28, 2024
మిడిల్ ఈస్ట్లో అతను తిరుగులేని శక్తి

ఇజ్రాయెల్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన హెజ్బొల్లా చీఫ్ <<14217449>>నస్రుల్లా<<>> Middle Eastలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో అప్పటి చీఫ్ అబ్బాస్ అల్-ముసావి దృష్టిని ఆకర్షించాడు నస్రుల్లా. 1992లో ముసావి మరణానంతరం హెజ్బొల్లాకు నాయకత్వం వహించాడు. ఎవరూ ఊహించని రీతిలో దాన్ని పటిష్ఠ పరిచాడు. 1997లో ఇజ్రాయెల్ బలగాల చేతిలో కుమారుడిని కోల్పోయిన నస్రుల్లా హెజ్బొల్లాను సాయుధ, రాజకీయ శక్తిగా మలిచాడు.
Similar News
News March 2, 2026
చైనా ఆయుధాలు మరోసారి తుస్సు

చైనా డిజైన్ చేసిన ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ మరోసారి ఫెయిలయ్యాయి. వీటిని నమ్ముకునే US, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి దెబ్బతింది. ఆ దేశం ఇచ్చిన HQ-9B డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల మిసైళ్లను ఎదుర్కోలేకపోయింది. కొన్నింటిని అసలు గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ భారీగా నష్టపోయింది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మడురో, ఆపరేషన్ సిందూర్ టైమ్లో పాక్ సైతం చైనాను నమ్ముకొని దెబ్బతిన్నాయి.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

మూన్ ల్యాండింగ్తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.


