News September 28, 2024
మిడిల్ ఈస్ట్లో అతను తిరుగులేని శక్తి

ఇజ్రాయెల్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన హెజ్బొల్లా చీఫ్ <<14217449>>నస్రుల్లా<<>> Middle Eastలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో అప్పటి చీఫ్ అబ్బాస్ అల్-ముసావి దృష్టిని ఆకర్షించాడు నస్రుల్లా. 1992లో ముసావి మరణానంతరం హెజ్బొల్లాకు నాయకత్వం వహించాడు. ఎవరూ ఊహించని రీతిలో దాన్ని పటిష్ఠ పరిచాడు. 1997లో ఇజ్రాయెల్ బలగాల చేతిలో కుమారుడిని కోల్పోయిన నస్రుల్లా హెజ్బొల్లాను సాయుధ, రాజకీయ శక్తిగా మలిచాడు.
Similar News
News March 9, 2026
‘పొండాట్టి’ థాంక్యూ.. సంజూ ఎమోషనల్ పోస్ట్!

శాంసన్ తన భార్య చారులతపై ఉన్న లవ్ను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. WC విజయం తర్వాత ఆయన పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. ‘పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా నిలిచినందుకు థాంక్యూ పొండాట్టి (భార్య). నా మంచినీ, చెడునీ చూసి కూడా నన్ను నన్నుగా ప్రేమించి నా పక్కనే బలంగా నిలబడ్డావు. నా లైఫ్లో క్రికెట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని ఈ క్షణం కోసం నాకంటే ఇంటెన్సిటీతో కలలు కన్నావు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
News March 9, 2026
మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుంది: UAE రాయబారి

ఇజ్రాయెల్, ఇరాన్ నేతలకు PM మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుందని ఇండియాలో UAE రాయబారి హుస్సేన్ హాసన్ మీర్జా అన్నారు. గల్ఫ్ నేతలే కాకుండా ప్రజలు, బిజినెస్ కమ్యూనిటీల్లోనూ మోదీపై గౌరవం ఉందని చెప్పారు. యుద్ధంలోకి దిగే ఆలోచన తమకు లేదని, UAEని లాంచింగ్ ప్యాడ్గా వాడుకునేందుకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇరాన్ తమ పొరుగు దేశమని, ఇజ్రాయెల్ మిత్రపక్షమని, రెండింటితోనూ చర్చలు జరపగలమని తెలిపారు.
News March 9, 2026
శ్రీలంక కొత్త కోచ్గా గ్యారీ కిర్స్టెన్

శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టెన్ నియమితులయ్యారు. APR 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టీమ్ ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కిర్స్టెన్ కోచ్గా ఉన్నారు. 2011-13 వరకు సౌతాఫ్రికా కోచ్గా పనిచేశారు. ఆ సమయంలో (2013) సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లలో ఐసీసీ నం.1 ర్యాంక్ సాధించింది. కాగా T20WC-2026లో శ్రీలంక సూపర్-8 దశలో ఓడటంతో కోచ్ జయసూర్య రాజీనామా చేశారు.


