News September 28, 2024
మిడిల్ ఈస్ట్లో అతను తిరుగులేని శక్తి

ఇజ్రాయెల్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన హెజ్బొల్లా చీఫ్ <<14217449>>నస్రుల్లా<<>> Middle Eastలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో అప్పటి చీఫ్ అబ్బాస్ అల్-ముసావి దృష్టిని ఆకర్షించాడు నస్రుల్లా. 1992లో ముసావి మరణానంతరం హెజ్బొల్లాకు నాయకత్వం వహించాడు. ఎవరూ ఊహించని రీతిలో దాన్ని పటిష్ఠ పరిచాడు. 1997లో ఇజ్రాయెల్ బలగాల చేతిలో కుమారుడిని కోల్పోయిన నస్రుల్లా హెజ్బొల్లాను సాయుధ, రాజకీయ శక్తిగా మలిచాడు.
Similar News
News March 7, 2026
భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.
News March 7, 2026
మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.
News March 7, 2026
వార్కు వారం!

ఇరాన్పై US, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత శనివారం (FEB 28) ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో US, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీంలీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్లో ఇప్పటివరకు 1200 మందికిపైగా చనిపోగా, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.


