News March 21, 2024
ఢిల్లీ సీఎం ఆయనే.. మంత్రి ప్రకటన

ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ తెలిపారు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని వ్యాఖ్యానించారు. సీఎంను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆమె చెప్పారు. దీనిపై ఈరోజు రాత్రే విచారణ జరపాలని కోరామన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ను రెండు గంటల పాటు విచారించిన ఈడీ.. కాసేపటి క్రితం అరెస్టు చేసింది.
Similar News
News April 8, 2025
రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.
News April 8, 2025
APలో ఇకనుంచి ఒకటే గ్రామీణ బ్యాంకు

APలో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒక్కటే ప్రజలకు సేవలందించనుంది. AP చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇందులో విలీనం కానున్నాయి. RBI ప్రణాళిక ప్రకారం 43 గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. ఈ బ్యాంకు ప్రధాన కేంద్రం అమరావతి కాగా, మే1 నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది.
News April 8, 2025
అదనపు టీచర్ పోస్టులపై CBI విచారణ అనవసరం: సుప్రీం

బెంగాల్ టీచర్ నోటిఫికేషన్లోని అదనపు పోస్టుల విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో 2016లో విడుదలైన నోటిఫికేషన్లో 6,861 అదనపు టీచర్ పోస్టుల అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మమతా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ తీర్పును రద్దుచేసింది.