News July 28, 2024
ఒంటరవుతుందేమోనని అమ్మను చంపేశాడు

TG: భద్రాద్రి కొత్తగూడెం(D) బూడిదగడ్డలో తుల్జాకుమారి పాసి(55) కుమారుడు వినయ్(27)తో ఉంటున్నారు. 10ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. రెండేళ్లుగా తల్లికి ఆరోగ్యం బాగుండటం లేదు. ఆర్థిక సమస్యలతో వినయ్ మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల అతడికీ ఓ జబ్బు వచ్చింది. ‘నాకు బతకాలని లేదు. నేను లేకపోతే అమ్మకు తోడెవరు?’ అని తనలో తాను మాట్లాడుకునేవాడు. ఈక్రమంలోనే శనివారం అర్ధరాత్రి తల్లిని హత్య చేసి, తాను ఉరేసుకున్నాడు.
Similar News
News January 26, 2026
ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT
News January 26, 2026
ICMRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<
News January 26, 2026
వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


