News July 28, 2024

ఒంటరవుతుందేమోనని అమ్మను చంపేశాడు

image

TG: భద్రాద్రి కొత్తగూడెం(D) బూడిదగడ్డలో తుల్జాకుమారి పాసి(55) కుమారుడు వినయ్(27)తో ఉంటున్నారు. 10ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. రెండేళ్లుగా తల్లికి ఆరోగ్యం బాగుండటం లేదు. ఆర్థిక సమస్యలతో వినయ్ మానసికంగా కుంగిపోయాడు. ఇటీవల అతడికీ ఓ జబ్బు వచ్చింది. ‘నాకు బతకాలని లేదు. నేను లేకపోతే అమ్మకు తోడెవరు?’ అని తనలో తాను మాట్లాడుకునేవాడు. ఈక్రమంలోనే శనివారం అర్ధరాత్రి తల్లిని హత్య చేసి, తాను ఉరేసుకున్నాడు.

Similar News

News November 15, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్‌తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ

News November 15, 2025

మరో కీలక మావో లొంగుబాటు?

image

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్‌తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.

News November 15, 2025

జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

image

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.