News April 1, 2024
భార్య, పిల్లలను చంపి 3 రోజులు అక్కడే నిద్రించాడు..

యూపీలోని లక్నోలో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. అక్రమ సంబంధం ఉందని అనుమానించి భార్య జ్యోతి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. పిల్లలు పాయల్(6), ఆనంద్(3)ని గొంతు నులిమి చంపేశాడు. 3 రోజులు మృతదేహాల పక్కనే పడుకుని ఉదయం పనులకు వెళ్లాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గది తాళాలు పగలగొట్టి డెడ్ బాడీలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News March 29, 2026
OTTలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. డేట్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17 లేదా 24వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 19న థియేటర్లలో విడుదలైంది.
News March 29, 2026
ఫ్రిజ్లో వీటిని పెడుతున్నారా?

తాజాగా ఉంటాయని అనవసరమైన వస్తువులనూ కొందరు ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ కొన్నింటికి గది ఉష్ణోగ్రత సరిపోతుందని హెల్త్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. పొటాటో, యాపిల్స్, క్యారెట్స్, టమాటా, మామిడి, అరటి పండ్లు, పుచ్చకాయలు, ఉల్లి, బ్రెడ్, వెల్లుల్లి, గుమ్మడి, తేనె, పిండి, ఊరగాయలు, గుడ్లు, దోసకాయలను ఫ్రిజ్లో పెట్టొద్దని సూచిస్తున్నారు. ఫ్రిజ్లో పెడితే అరటి, పుచ్చ వంటివి త్వరగా పాడవుతాయని అంటున్నారు.
News March 29, 2026
ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు-2026’కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనంలో ప్రభుత్వం 15% కోత విధిస్తుంది. ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తుంది. ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఇది వర్తిస్తుంది. పేరెంట్స్ను పట్టించుకోని వారికి ఇది గుణపాఠం అని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని CM రేవంత్ వ్యాఖ్యానించారు.


